చేవెళ్లలో మల్లన్న గుడికి రూ. 30 లక్షల విరాళం

చేవెళ్లలో మల్లన్న గుడికి రూ. 30 లక్షల విరాళం

చేవెళ్ల, వెలుగు: చేవెళ్లలో మల్లన్న గుడి నిర్మాణానికి చేవెళ్ల సహకార సంఘం చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి రూ.30 లక్షల విరాళం అందజేశారు. ఇంతకుముందే కొంత డబ్బు అందజేయగా.. మిగతావి శుక్రవారం చెక్కు రూపంలో చెల్లించారు. దాతలు మాట్లాడుతూ.. గుడి నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.