
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రూ.180.38 కోట్ల మెడికల్ రియింబర్స్మెంట్పెండింగ్ బిల్లులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు విడుదల చేశారు. దీంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 13న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా క్లియర్ చేసింది.