ముచ్చింతల్​లోమోహన్ భగవత్

ముచ్చింతల్​లోమోహన్ భగవత్
  • శ్రీరామనగరంలో ప్రత్యేక పూజలు

శంషాబాద్, వెలుగు : ముచ్చింతల్  గ్రామంలోని శ్రీరామనగరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం  మోహన్ భగవత్ అక్కడే ఉన్న రామానుజుల విగ్రహాన్ని పరిశీలించారు.

చిన జీయర్ స్వామితో సమావేశమై కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో మోహన్ భగవత్​కు చిన జీయర్ స్వామి మంగళ శాసనాలు అందించగా, చినజీయర్ స్వామికి మోహన్ భగవత్ సీతారాముల విగ్రహాలతో కూడిన జ్ఞాపికను అందించారు.