- శ్రీరామనగరంలో ప్రత్యేక పూజలు
శంషాబాద్, వెలుగు : ముచ్చింతల్ గ్రామంలోని శ్రీరామనగరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మోహన్ భగవత్ అక్కడే ఉన్న రామానుజుల విగ్రహాన్ని పరిశీలించారు.
చిన జీయర్ స్వామితో సమావేశమై కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో మోహన్ భగవత్కు చిన జీయర్ స్వామి మంగళ శాసనాలు అందించగా, చినజీయర్ స్వామికి మోహన్ భగవత్ సీతారాముల విగ్రహాలతో కూడిన జ్ఞాపికను అందించారు.