హైదరాబాద్సిటీ, వెలుగు: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో గ్రేటర్పరిధిలో ఆర్టీఏ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా ప్రైవేట్బస్సుల తనిఖీలు కొనసాగించారు. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మేడ్చల్రోడ్, ఉప్పల్తదితర ప్రాంతాల్లో ప్రైవేట్బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్సేఫ్టీ, ఫస్ట్ఎయిడ్బాక్సులు, అలారం, ఎగ్జిట్విండోస్దగ్గర సుత్తి లేకపోవడం లాంటి విషయాలను గమనించి కేసులు నమోదు చేయడమే కాకుండా ఫైన్లు వేశారు.
గగన్పహాడ్వద్ద బెంగళూరు నుంచి వస్తున్న పలు ప్రైవేట్ట్రావెల్స్బస్సులను చెక్చేసి ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏడు బస్సులపై కేసు నమోదు చేసి రూ.35 వేల ఫైన్విధించారు.
మరో ఆర్టీఏ బృందం సౌత్జోన్ పరిధిలో తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదుచేసి రూ.31వేల జరిమానా విధించింది. ఈస్ట్ జోన్ పరిధిలో 3 కేసులు నమోదు చేసి 3వేలు జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఆదివారం 21 కేసులను నమోదు చేసి 69వేల జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు.
