RTC బస్సు-బైక్ ఢీ: వ్యక్తి మృతి

RTC బస్సు-బైక్ ఢీ: వ్యక్తి మృతి

హైదరాబాద్: RTC బస్సు, బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మలక్ పేటలో జరిగింది. ముసారాంబాగ్ చౌరస్తాలో బైక్-దిల్ సుఖ్ నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును వెనకాల నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు ప్రత్యక్ష సాక్షలు. దీంతో బైకర్..అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మలక్ పేట పోలీసులు.. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హస్పిటల్ కి తరలించారు.

మృతుడిని నాగోల్‌కు చెందిన చంద్రశేఖర్‌ (20)గా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.