కారును ఢీకొట్టి లోయలో పడిన ఆర్టీసీ బస్సు

కారును ఢీకొట్టి లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని లోయలో పడిపోయాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా.. 19 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ సమీపంలోని గాడిదల గండి గుట్ట అటవీ ప్రాంతంలో జరిగింది. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళ్తున్న పరకాల డిపో బస్సు.. కారును ఢీకొట్టింది. దాంతో అదుపు తప్పి రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఖాన్‌సాయిపేటకు చెందిన వినీత్‌ అనే వ్యక్తి మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాలు కాగా.. మరో 16 మందికి స్వల్పంగా గాయలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.