బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

జగిత్యాల జిల్లా మేడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఆంధ్ర బ్యాంక్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. రహదారిపై వెళుతున్న ఆ బైక్ ను బస్సు ఢీ కొట్టడంతో యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.