
- ప్యాసింజర్లకు గాయాలు
వికారాబాద్, వెలుగు : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లగా.. ప్యాసింజర్లు గాయపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. శనివారం ఉదయం అనంతగిరి ఘాట్ రోడ్ లో ఆర్టీసీ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు విరగగా..
మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిట్నెస్ లేని బస్సుల కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్ ఆరోపించారు.