శబరిమల యాత్ర కోసం అద్దెకు ఆర్టీసీ బస్సులు..బుకింగ్ కోసం వివరాలు

శబరిమల యాత్ర కోసం అద్దెకు ఆర్టీసీ బస్సులు..బుకింగ్ కోసం వివరాలు

సికింద్రాబాద్, వెలుగు : శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారుల కోసం ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు  రాణిగంజ్ డిపో మేనేజర్ లక్ష్మి ధర్మా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శబరిమల వెళ్లే వారు ముందుస్తుగా బస్సులను బుక్ చేసుకోవాలన్నారు. ఈ బస్సుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని ఆయన తెలిపారు. దూర ప్రయాణం కావడంతో అనుభవం ఉన్న డ్రైవర్లతో ఈ బస్సులను నడుపనున్నట్లు పేర్కొన్నారు. బస్సులను గురుస్వామి బుక్ చేస్తే వారికి ఉచితంగా సీటు సదుపాయం కల్పిస్తామన్నారు.

ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంటమనుషులు, లగేజీ మోసే వ్యక్తికి సైతం ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందన్నారు. ఎక్కువ బస్సులు బుక్ చేసే వారికి రాయితీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శబరిమల వెళ్లి వచ్చే దారిలో ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ లక్ష్మి ధర్మ తెలిపారు. మరింత సమాచారం కోసం 9959912219 నంబర్​కు కాల్ చేయాలన్నారు.