వీరిలో ముగ్గురు మహిళలు
ఎల్బీనగర్, వెలుగు: ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగ్ల నుంచి బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తిని ఎల్బీ నగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నందికొట్కూరుకు చెందిన పాత నేరస్తురాలు తమ్మిశెట్టి వాని అలియాస్ చిట్టి (26), గోగుల దానమ్మ (55), తమ్మిశెట్టి రాజు (32), తమ్మిశెట్టి నాగమణి (26) ఓ గ్యాంగ్గా మారారు.
వీరు నెలకు రెండు మూడు సార్లు హైదరాబాద్కు వచ్చి రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్సులను ఎల్బీ నగర్లో ఎక్కుతున్నారు. వీరిలో వాని, దానమ్మ ఫుట్ బోర్డ్లో ఉంటూ.. రాజు, నాగమణి బస్సులోని ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను గుర్తు తెలియకుండా దొంగిలిస్తున్నారు.
ఈ నెల 8న కృష్ణా నందిత అనే మహిళ బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్లోని 6 తులాల బంగారు గాజులను దొంగిలించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
