ఇంటర్ పరీక్షలకు అదనపు బస్సులు

ఇంటర్ పరీక్షలకు అదనపు బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: నేటి నుంచి మార్చి 13 వరకూ జరిగే ఇంటర్​పరీక్షల నేపథ్యంలో అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బాలికలకు మహాలక్ష్మి పథకం కింద, బాలలు హాల్​టికెట్​చూపిస్తే ఎగ్జామినేషన్​సెంటర్​ఎక్కడున్నా రూట్​పాస్​పై ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామన్నారు.

పాస్​లేని స్టూడెంట్స్​నుంచి సాధారణ ఛార్జీలు తీసుకుంటామన్నారు. పబ్లిక్​హాలిడేస్, సెలవు దినాల్లో పరీక్షలున్నా కూడా ఇవి వర్తిస్తాయన్నారు. కన్సెషనల్​పాస్​ఉన్న స్టూడెంట్స్​ను ఎక్స్​ప్రెస్​ బస్సుల్లోనూ ప్రయాణించడానికి అనుమతిస్తామన్నారు. ఆయా బస్​స్టేషన్లలో హెల్ప్​డెస్క్​ను కూడా ఏర్పాటుచేసినట్టు చెప్పారు.