- ఉక్రెయిన్ ప్రజలకు అధికారుల సూచన
కీవ్: రష్యా దాడుల దృష్ట్యా ప్రజలు బిల్డింగ్లపై ఏమైనా మార్కింగ్ ట్యాగ్స్ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని ఉక్రెయిన్ అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో ఎత్తయిన బిల్డింగ్లు, గ్యాస్పైపులు ఇతర నిర్మాణాలపై రెడ్కలర్లో మార్కింగ్ లేదా ట్యాగ్ వేస్తున్నారని, దాన్ని టార్గెట్చేసుకొనే రష్యా సైనికులు బాంబు దాడులు చేస్తున్నారని అధికారులు సోషల్మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. దాడుల దృష్ట్యా ప్రజలు తమ బిల్డింగ్ల పైకి ఎక్కి చెక్ చేయాలని, ఎదైనా మార్కింగ్ కనిపిస్తే దాన్ని చెరిపేయాలని పశ్చిమ ఉక్రెయిన్లోని రివ్నే సిటీ మేయర్ అలెగ్జాండర్ ట్రెట్యాక్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు.