ఇవాళ భారత్ కు రష్యా విదేశాంగ మంత్రి రాక

ఇవాళ భారత్ కు రష్యా విదేశాంగ మంత్రి రాక
  • రెండు రోజుల పాటు సాగనున్న పర్యటన
  • రేపు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీ

న్యూఢిల్లీ: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇవాళ భారత్ కు రానున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. సెర్గీ లావ్రోవ్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రేపు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జయశంకర్ తో భేటీ కానున్నారు. భారత్- రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాల గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా మంత్రి భారత్ లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

మరిన్ని వార్తల కోసం...

హైదరాబాద్‌లో రూ.115 దాటిన పెట్రోల్ రేటు

శ్రీరామ నవమికి స్పెషల్​ బస్సులు