యూరప్‌లో అతిపెద్ద  యుద్ధానికి రష్యా ప్లాన్

యూరప్‌లో అతిపెద్ద  యుద్ధానికి రష్యా ప్లాన్
  • బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపణ  
  • ఆల్రెడీ మొదలెట్టినట్లు సిగ్నల్స్ వస్తున్నయ్
  • డాలర్లు, పౌండ్లలో వ్యాపారం చేసుకోనివ్వబోమని హెచ్చరిక

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాగాలని రష్యా ప్రయత్నాలు చేస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ‘‘రష్యా ప్లాన్.. 1945 తర్వాత యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే అతిపెద్ద యుద్ధమని చెప్పడానికి నేను భయపడుతున్నా. యుద్ధానికి సంబంధించిన ప్లాన్ ఇప్పటికే మొదలైనట్లు మాకు సంకేతాలు వస్తున్నాయి. ఈ యుద్ధం జరిగితే చెల్లించుకోవాల్సిన మూల్యం గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని ఆయన చెప్పారు. ఆదివారం మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ నుంచి బీబీసీ ఇంటర్వ్యూలో జాన్సన్ మాట్లాడారు. బెలారస్ నుంచి కూడా కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చుట్టుముట్టాలని రష్యా ప్లాన్ చేస్తోందన్నారు. 
ఆర్థికంగా స్తంభింపజేస్తం
ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేస్తే గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రష్యా ఆర్థిక కార్యకలాపాలను స్తంభింపజేస్తామని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. అంతకుముందు జర్మనీలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడిన జాన్సన్.. ఏదైనా దాడి జరిగితే అందుకు ప్రతిస్పందనగా వెస్ట్రన్ దేశాలు విధించే ఆంక్షలు.. రష్యాకు లండన్ మార్కెట్లను యాక్సెస్ చేసే వీలులేకుండా ఉంటాయని హెచ్చరించారు. రష్యన్ కంపెనీలు పౌండ్లు, డాలర్లలో ట్రేడ్ చేయకుండా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ ప్రతిఘటనకు పశ్చిమ దేశాలు మద్దతిస్తాయని చెప్పారు.

ఇండియన్లు వచ్చేయండి
ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మన సిటిజన్లు, స్టూడెంట్లు వెంటనే వెనక్కి రావాలని కేంద్రం కోరింది. అత్యవసరమైతే తప్ప అక్కడ ఉండొద్దని చెప్పింది. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్ ఎంబసీ ఈమేరకు రెండో అడ్వైజరీ జారీ చేసింది. అందుబాటులోని ఫ్లైట్లు పట్టుకుని ఇండియన్ సిటిజన్లు తాత్కాలికంగా ఆ దేశం నుంచి బయటపడాలని సూచించింది. చార్టర్ ఫ్లైట్లపై అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్ కోసం కాంట్రాక్టర్లతో టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండాలని, ఇండియన్ ఎంబసీ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ట్విట్టర్, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవ్వాలని చెప్పింది. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏదైనా సమాచారం, సాయం అవసరమైతే విదేశాంగ శాఖను కాంటాక్ట్ కావొచ్చని చెప్పింది. తమ సిటిజన్లు ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడిచిపెట్టి వచ్చేయాలని జర్మనీ, ఆస్ట్రియా కూడా ఇప్పటికే ఆదేశాలిచ్చాయి.
పుతిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఫోన్
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుతిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ ఫోన్ చేశారు. సమస్యను పరిష్కరించుకునేందుకు మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. చర్చలు జరపాల్సిన ప్రాంతాన్ని రష్యా ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. ‘‘రష్యన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏంకావాలో నాకు అర్థం కావడంలేదు. అందుకే మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పాను” అని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమెరికా వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిశారు. శాంతియుత పరిష్కారం కోసం దౌత్య మార్గాన్ని మాత్రమే ఉక్రెయిన్ అనుసరిస్తుందని తెలిపారు. అయితే క్రెమ్లిన్ నుండి వెంటనే ఎలాంటి స్పందన లేదు.