ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఇంకో రూ.2 వేల కోట్లు
హైదరాబాద్, వెలుగు : రైతుల బ్యాంకు ఖాతా ల్లో రైతుబంధు నగదు జమ తిరిగి ప్రారంభమైంది. ఈ నెల 24 నుంచి జమ చేస్తున్నారు. 24న 5 ఎకరాల వరకు మిగిలిపోయిన 55,130 మంది రైతులకు రూ.83.30 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది. 27న 5.11 ఎక రాల వరకు 49,990 మంది రైతులకు రూ. 128.56 కోట్లు జమ చేసింది. తాజాగా, శుక్ర వారం 5.26 ఎకరాల వరకు భూములున్న 49,990 మంది రైతులకు రూ.136.54 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 63.35 లక్షల మంది రైతులకు చెందిన 1.13 కోట్ల ఎకరాలకు రూ. 5,694.90 కోట్లు అందజేసినట్లు తెలిపింది. ఇంకో రూ.2 వేల కోట్లు జమ చేస్తామని పేర్కొన్నది.