
- 75,525 మంది రైతుల ఖాతాల్లో రూ.65.82 కోట్లు జమ: మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల సాగులో ఉన్న భూములకు సైతం రైతు భరోసా నిధులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 75,525 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.65.82 కోట్ల నిధులు జమ చేసినట్టు ఆయన బుధవారం వెల్లడించారు. సాగులో లేని భూములు, సాగుకు అనువుకాని భూములు, వెంచర్లు చేసిన భూములను రైతు భరోసా పథకం నుంచి మినహాయించినట్టు మంత్రి స్పష్టం చేశారు.