అన్ని వర్గాలు బాగుపడాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం :  సబితా ఇంద్రారెడ్డి

అన్ని వర్గాలు బాగుపడాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం :  సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, వెలుగు : అన్ని వర్గాలు బాగుపడాలన్నదే బీఆర్ఎస్ సర్కారు లక్ష్యమని మహేశ్వరం సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  శనివారం ఆర్కేపురం డివిజన్ ఫేజ్–2, ఫేజ్–3కి చెందిన బీజేపీ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్, కుమార్, కృష్ణ, సోములు, తన అనుచరులతో కలిసి సబితా రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్​లో చేరారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పేద, మధ్యతరగతి జనాల ప్రభుత్వమన్నారు.  

ఆసరా పెన్షన్ల పెంపు, రూ.400కే సిలిండర్, అర్హులైన మహిళలకు ప్రతి నెల రూ. 3 వేలు, రేషన్ కార్డు మీద సన్న బియ్యం పంపిణీ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ మేనిఫెస్టోను తీసుకొచ్చామన్నారు. మహేశ్వరం నుంచి మరోసారి గెలిపిస్తే మీలో ఒకరిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ బాధ్యతతో పనిచేస్తానని ఆమె తెలిపారు. అనంతరం రంగారెడ్డి జిల్లా వాసులకు సబితా ఇంద్రారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం సెగ్మెంట్ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షుడు నగేశ్ , సీనియర్ నాయకులు సాజిత్ , గొడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.