
ఖైరతాబాద్,వెలుగు : దీపావళి పండుగను పురస్కరించుకుని ఖైరతాబాద్ నవయుగ యాదవ్సంఘం ఆధ్వర్యంలో మంగళారపు చౌద్రి యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సదర్ సమ్మేళనం జరిగింది. సుల్తాన్పురాకు చెందిన శ్రీకృష్ణ డైరీఫాం నిర్వాహకుడు ఎం.మల్లేశ్యాదవ్కు చెందిన దున్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సదర్ ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై తొలిపూజ చేసి ప్రారం భించి మాట్లాడారు. సదర్ వేడుకల్లో రాజు యాదవ్,సుధాకర్ యాదవ్,మల్లికార్జున్ యాదవ్, మహేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గండిపేట్ : నార్సింగిలో సదర్ సమ్మేళనం మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ హాజరై దున్నపోతులకు పూజలు చేశారు. అనంతరం వాడవాడలా డప్పు దరువుల మధ్య దున్నపోతులను ఊరేగించారు. నిజాం కాలం నుంచి సదర్ఉత్సవం ఆనవాయితీగా వస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు.