- కుంకుమ పువ్వు కిలో రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షలు పలుకుతున్న ధర
- జమ్మూ కశ్మీర్లో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తి డబుల్
- పుల్వామాలోని పాంపోర్లో రైతులు బిజీ బిజీ
- కాశ్మీర్లో 9వేల ఎకరాల్లో సాగు
- టూరిస్టులను ఆకట్టుకుంటున్న పువ్వులు
శ్రీనగర్: కుంకుమ పువ్వు.. అనగానే గుర్తుకొచ్చేది కాశ్మీర్. ఇండియాలో హై క్వాలిటీ సాఫ్రాన్ కాశ్మీర్లో తప్ప మరెక్కడా దొరకదు. వరల్డ్ వైడ్గా చూసుకున్నా.. కాశ్మీరీ కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు ఒకటి. కొండ ప్రాంతాల్లోని పొడి నేలలో ఇది ఎక్కువగా పండుతుంది. తాజాగా పుల్వామా జిల్లా పాంపోర్లో సాఫ్రాన్ సాగు మస్త్ లాభాలు ఇస్తున్నది. చాలా ఏండ్ల తర్వాత వర్షాలు బాగా పడటంతో కుంకుమ పువ్వు ప్రొడక్షన్ పెరిగిందని అక్కడి రైతులు చెబుతున్నారు. పువ్వు చేతికి రావడంతో, రైతు కుటుంబాలన్నీ ఇప్పుడు సాఫ్రాన్ సేకరణలో బిజీ బిజీగా ఉంటున్నాయి. కాశ్మీరీ కుంకుమ పువ్వు కిలో రూ.3.50 లక్షల నుంచి 4లక్షల వరకు ఉంటుందని, ఇక్కడి సాఫ్రాన్ను బంగారంతో సమానంగా చూస్తారని ఫర్హద్ హుస్సేన్ చెప్పాడు. అందుకే కుంకు పువ్వును ‘రెడ్ గోల్డ్’గా పిలుస్తారని తెలిపాడు. గతేడాదితో పోలిస్తే ప్రొడక్షన్ డబుల్ అయ్యిందని ఆనందం వ్యక్తం చేశాడు.
కుంకుమ పువ్వు సేకరణలో బిజీ.. బిజీ..
కాశ్మీర్ రీజియన్లో వందలాది కుటుంబాలు కుంకుమ పువ్వునే సాగు చేస్తుంటాయి. సుమారు 9వేల ఎకరాల్లో పండిస్తారు. పుల్వామా జిల్లాలోని పాంపోర్ ఏరియాలో సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఆశించినదానికంటే ఎక్కువ దిగుబడి వచ్చిందని నసీర్ హమీద్ అనే రైతు ఆనందం వ్యక్తం చేశాడు. కుంకుమ పువ్వు సేకరణలో తన ఫ్యామిలీ అంతా బిజీ అయిపోయిందని చెప్పాడు. ఈ ప్రాంతమంతా సాఫ్రాన్ సాగుపైనే ఆధారపడి జీవిస్తుందన్నారు. ప్రభుత్వం కాశ్మీరీ కుంకుమ పువ్వుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగింగ్ ఇచ్చిందని తెలిపాడు. ఇలా చేయడంతో ప్రతీ ఒక్కరికీ కాశ్మీరీ క్వాలిటీ సాఫ్రాన్ దొరుకుతుందని వివరించాడు. జీఐ ట్యాగింగ్తో రైతులకు కూడా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని చెప్పాడు. పాంపోర్ నుంచే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలకు కుంకుమ పువ్వు ఎక్స్పోర్ట్ అవుతుందని తెలిపాడు. గతంతో పోలిస్తే సేల్స్ కూడా రెట్టింపు అయ్యాయని తెలిపాడు.
టూరిస్టులకు స్పెషల్ అట్రాక్షన్గా పాంపోర్
వరల్డ్స్ బెస్ట్ సాఫ్రాన్ సాగును చూసేందుకు టూరిస్టులు స్పెషల్గా పుల్వామాలోని పాంపోర్కు వస్తుంటారు. ఈ ఏడాది ప్రొడక్షన్ బాగుండటంతో, వారం రోజుల నుంచి వందలాది మంది టూరిస్టులు కుంకుమ పువ్వు సాగును చూసి వెళ్తున్నారు. సేకరణ నుంచి ప్యాకింగ్ దాకా ప్రతీ అంశాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మెరూన్, ఎల్లో, పుర్పుల్ కలర్స్లో కనిపించే పువ్వులను చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల శ్రమను మెచ్చుకుంటున్నారు. కొంతమంది టూరిస్టులు కుంకుమ పువ్వును కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దాల్ లేక్, పహల్గం, గుల్మార్గ్తో పాటు కుంకుమ పువ్వు పొలాలు కూడా కాశ్మీర్లోని టూరిస్ట్ స్పాట్స్లో ఒకటిగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం కూడా పాంపోర్లో సాఫ్రాన్ పార్క్ను ఏర్పాటు చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నది. కుంకుమ పువ్వు వాడకం ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పూజా సామగ్రి, స్వీట్లు, సెంట్లను తయారు చేయడానికి కూడా సాఫ్రాన్ ఉపయోగిస్తారు.