ఏప్రిల్ 26 లేదా 29న సాగర్ బై ఎలక్షన్!

ఏప్రిల్ 26 లేదా 29న సాగర్ బై ఎలక్షన్!
  • ఈ నెలాఖరుకు సాగర్ బై ఎలక్షన్ షెడ్యూల్!

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ బైఎలక్షన్ షెడ్యూల్ ఈ నెలాఖరుకు విడుదల కానుంది. దీని కోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మార్చి 31న షెడ్యూల్ విడుదల చేసే చాన్స్ ఉంది. ఏప్రిల్ 26 లేదా 29న పోలింగ్ ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు భావిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీకి 8 దశల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 7, 8 దశలకు ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 31 విడుదల కానుంది. కానీ 7 వ దశ పోలింగ్ ఏప్రిల్ 26న,  8వ దశ పోలింగ్ 27న ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక తేదీన సాగర్ కు పోలింగ్ ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 1న నోములు నర్సింహయ్య మరణంతో సాగర్ లో ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు బై పోల్ కోసం రెడీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీలు సాగర్ పై దృష్టి సారించాయి. అభ్యర్థి ఎంపిక కోసం టీఆర్ఎస్ ఆశావహుల పేర్లతో పలు సర్వేలు జరిపించింది. బీజేపీ స్ట్రాంగ్ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. ఆయన గత మూడు నెలలుగా స్థానికంగా ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.