ఎండ తీవ్రత దృష్ట్యా హైకోర్టు సిబ్బందికి సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోమియో వడదెబ్బ నివారణ మందులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆవరణంలో రిజిస్ట్రార్ జ్యూడిషియల్ జీవన్ కుమార్ను సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి మందులను అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షులు చినుకని యువరాజు, సభ్యులు బాతరాజు మణికంఠ, నాగేల్లి సందీప్ పాల్గొన్నారు.
