
శివ కార్తికేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో పోషించిన అమరన్ మూవీ దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత సాయి పల్లవి నటిస్తున్న మూవీ కావడంతో అమరన్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
Also Read : అమరన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్గా ఇండియన్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్
పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి (Rajkumar Periyaswami).
కాగా ఈ చిత్రంలో పవర్ఫుల్ ఆర్మీ ఆఫిసర్ ముకుంద్ పాత్ర పోషించారు కార్తికేయన్. సాయి పల్లవి ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే సాయిపల్లవిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ వివరాల్లోకి వెళితే..
విరాటపర్వం మూవీ ప్రమోషన్లో చాలా యాక్టీవ్గా పాల్గొన్న హీరోయిన్ సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మరాయి. ఉగ్రవాదం, హింస అంశాల గురించి సాయిపల్లవి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
“పాకిస్థాన్ సైనికులను.. మనం భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే, పాకిస్థాన్లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. దృక్పథాలు ఇలా మారిపోతుంటాయి.. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా.. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు..ఇప్పుడు ఆమె నటించిన అమరన్ మూవీ రిలీజ్ సందర్బంగా నెటిజన్స్ బాగా వైరల్ చేస్తున్నారు.
అయితే.. ఇదే ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. " కొన్ని రోజుల క్రితం 'ది కశ్మీర్ ఫైల్స్' అనే సినిమా వచ్చింది.. ఆ టైమ్ లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు .. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్ గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్ ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది.’’ అంటూ సాయిపల్లవి కామెంట్స్ చెసింది.
అప్పట్లో సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్..ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఆమె పైన ఫైర్ అవుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం సాయి పల్లవి కామెంట్స్ను సమర్ధిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ముందుముందు ఏమవుతుందో చూడాలి.
When the terrorists from Pakistan made multiple attacks on India in the past by invading into our territory, they were obviously brainwashed with the statement as shown in the trailer. One can understand that and that’s how they will think.
— Raghu Rajaram (@RaghuTweetbook) October 25, 2024
But the video clip of Sai Pallavi’s… pic.twitter.com/1ICGiWoZsB