Sai Pallavi: సాయిపల్లవిని విమర్శిస్తున్న నెటిజన్లు.. అమరన్ రిలీజ్‍కు ముందు ఏంటి ఈ గోల.. కారణమిదే!

Sai Pallavi: సాయిపల్లవిని విమర్శిస్తున్న నెటిజన్లు.. అమరన్ రిలీజ్‍కు ముందు ఏంటి ఈ గోల.. కారణమిదే!

శివ కార్తికేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో పోషించిన అమరన్ మూవీ దీపావళి సందర్భంగా రిలీజ్‍ కానుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత సాయి పల్లవి నటిస్తున్న మూవీ కావడంతో అమరన్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Also Read : అమరన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. చీఫ్ గెస్ట్గా ఇండియన్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్

పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periyaswami).

కాగా ఈ చిత్రంలో పవర్ఫుల్ ఆర్మీ ఆఫిసర్ ముకుంద్ పాత్ర పోషించారు కార్తికేయన్. సాయి పల్లవి ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే సాయిపల్లవిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

విరాటపర్వం మూవీ ప్రమోషన్లో చాలా యాక్టీవ్గా పాల్గొన్న హీరోయిన్ సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మరాయి. ఉగ్రవాదం, హింస అంశాల గురించి సాయిపల్లవి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

“పాకిస్థాన్ సైనికులను..  మనం భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే, పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. దృక్పథాలు ఇలా మారిపోతుంటాయి.. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా.. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు..ఇప్పుడు ఆమె నటించిన అమరన్ మూవీ రిలీజ్ సందర్బంగా నెటిజన్స్ బాగా వైరల్ చేస్తున్నారు.

అయితే.. ఇదే ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. " కొన్ని రోజుల క్రితం 'ది కశ్మీర్ ఫైల్స్' అనే సినిమా వచ్చింది.. ఆ టైమ్ లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు .. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్ గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్ ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది.’’ అంటూ సాయిపల్లవి కామెంట్స్ చెసింది. 

అప్పట్లో సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్..ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  కొందరు నెటిజన్లు ఆమె పైన ఫైర్ అవుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం సాయి పల్లవి కామెంట్స్ను సమర్ధిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ముందుముందు ఏమవుతుందో చూడాలి.