యూపీలో లవ్ జిహాద్ చట్టానికి ఆమోదం : ఫక్రుల్ హసన్ చంద్

యూపీలో లవ్ జిహాద్ చట్టానికి ఆమోదం : ఫక్రుల్ హసన్ చంద్
  • మరింత కఠినంగా నిబంధనలు

లక్నో: ఉత్తరప్రదేశ్​లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రతికూల రాజకీయాలు చేయాలనుకుంటోందని సమాజ్‌‌వాదీ పార్టీ నాయకుడు ఫక్రుల్ హసన్ చంద్ మండిపడ్డారు. సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘లవ్ జిహాద్’కు సంబంధించిన చట్టంలో సవరణలు తీసుకురావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం యోగి సర్కారు అసెంబ్లీలో చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ (సవరణ) బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం యూపీలో ‘లవ్ జిహాద్’కి పాల్పడిన వారికి జీవిత ఖైదు విధిస్తారు. అలాగే, బిల్లు కింద పేర్కొన్న కొన్ని నేరాలకు శిక్షలను రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది.

ఈ సవరణలపై ఫక్రుల్ హసన్ చంద్ స్పందిస్తూ మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు.  ‘‘లవ్ జిహాద్‌‌పై ఆర్డినెన్స్ తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చట్టం చేసింది. ఎవరైనా ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తే దాని కోసం చట్టం ఉంది. కానీ, బీజేపీ మాత్రం దానికి మళ్లీ సవరణలు చేసి.. ప్రతికూల రాజకీయాలు చేయాలనుకుంటోంది’’ అని ఆయన మళ్లీ సవరణలు చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.