రాజ్యసభలో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్. త్వరలో బీజేపీకి చెడ్డ రోజులు రానున్నాయని..ఇదే తన శాపమంటూ మండిపడ్డారు. రాజ్యసభ ఛైర్మన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో కొందరు బీజేపీ సభ్యులు ఐశ్వర్యరాయ్ ప్రస్తావన తెచ్చారని తప్పుబట్టారు. సభలో వ్యక్తిగతంగా విమర్శలు చేశారని.. అయినా ఛైర్మన్ వారించకపోవడం కరెక్ట్ కాదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్ణకరమని.. తాను ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు. పనామా పేపర్స్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సభలో కొందరు ఐశ్వర్య గురించి కామెంట్ చేశారని జయాబచ్చన్ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ను ప్రశ్నించిన ఈడీ