రూ. 8 కోట్లతో ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సమంత

రూ. 8 కోట్లతో ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్ లో విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. దాదాపు 8 కోట్ల విలువ చేసే ఈ అపార్ట్మెంట్ లో .. 6 కారు పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. బిల్డింగ్ 13వ అంతస్తులో 3,920 చదరపు అడుగులు, 14వ అంతస్తులో 4,024 చదరపు అడుగులు.. మొత్తం 7,944 చదరపు అడుగుల విస్తీర్ణంలో సూపర్ బిల్ట్-అప్ ఏరియాను కలిగి ఉందట ఈ బిల్డింగ్.

సమంత తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటీరియర్ ని డిజైన్ చేయించుకుందట. ఈ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయట. అందుకోసం.. మోడ్రన్ మరియు ఎర్త్ ఇంటీరియర్  ఐటెమ్స్ యూస్ చేస్తున్నారట.  హైదరాబాద్ లోనే కాదు సమంతకి ముంబై లో కూడా 15 కోట్ల విలువ చేసే రాజభవనం లాంటి ఇల్లు ఉంది. ప్రస్తుతం సమంత కొత్త ఖరీదైన అపార్ట్మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.