మార్చి 8 నుంచి ఖుషి ఖుషిగా షూటింగ్ లో సమంత

మార్చి 8 నుంచి ఖుషి ఖుషిగా షూటింగ్ లో సమంత

‘మయోసైటిస్‌‌’తో కొన్ని రోజులుగా రెస్ట్‌‌లో ఉన్న సమంత..  ప్రస్తుతం వరుస షూటింగ్స్‌‌లో పాల్గొంటూ బిజీ అవుతోంది. రీసెంట్‌‌గా ‘సిటాడెల్’ సెట్‌‌లో జాయిన అయిన ఆమె.. ఇప్పుడు ‘ఖుషి’ కోసం కాల్షీట్స్ కేటాయించిందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా, శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ చిత్రం కొంత షూట్ తర్వాత బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సమంత కోలుకోవడంతో తిరిగి రెగ్యులర్ షూటింగ్‌‌ను స్టార్ట్ చేశారు మేకర్స్. హైదరాబాద్‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌లో ప్రస్తుతం షూటింగ్‌‌ జరుగుతోంది.

ఈ షెడ్యూల్‌‌లో మార్చి 8 నుంచి  సమంత పాల్గొనబోతుందట. వీలైనంత త్వరగా ఈ సినిమాను  పూర్తిచేసేలా సమంత ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న  ఈ చిత్రాన్ని జూన్‌‌లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయరామ్, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, రోహిణి , శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు సమంత లీడ్ రోల్‌‌లో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న   ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది.