‘మయోసైటిస్’తో కొన్ని రోజులుగా రెస్ట్లో ఉన్న సమంత.. ప్రస్తుతం వరుస షూటింగ్స్లో పాల్గొంటూ బిజీ అవుతోంది. రీసెంట్గా ‘సిటాడెల్’ సెట్లో జాయిన అయిన ఆమె.. ఇప్పుడు ‘ఖుషి’ కోసం కాల్షీట్స్ కేటాయించిందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా, శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ చిత్రం కొంత షూట్ తర్వాత బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సమంత కోలుకోవడంతో తిరిగి రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేశారు మేకర్స్. హైదరాబాద్లో వేసిన స్పెషల్ సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
ఈ షెడ్యూల్లో మార్చి 8 నుంచి సమంత పాల్గొనబోతుందట. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేసేలా సమంత ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని జూన్లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయరామ్, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, రోహిణి , శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు సమంత లీడ్ రోల్లో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది.