కనుల పండువగా ‘సమతా కుంభ్’

కనుల పండువగా ‘సమతా కుంభ్’

ముచ్చింతల్​లోని శ్రీరామ నగరంలో ‘సమతా కుంభ్–2023’ పేరుతో నిర్వహిస్తున్న శ్రీరామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతం, అష్టాక్షరీ మంత్ర జపం, ఆరాధన, నిత్య పూర్ణాహుతి, ఉదయం 11 గంటలకు డోలోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం రామచంద్రమూర్తికి హనుమద్వాహన సేవ నిర్వహించారు. ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

– వెలుగు, శంషాబాద్