నూతన వధూవరులకు గిఫ్ట్ గా ఇసుక డబ్బా

నూతన వధూవరులకు గిఫ్ట్ గా ఇసుక డబ్బా

విశాఖ జిల్లా: పెళ్లి వేడుకకు హాజరైన వ్యక్తి నూతన వధూవరులకు ఇసుక డబ్బా ను  బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. అనకాపల్లి మండలం కొత్త తలారీవానిపాలెం గ్రామంలో మామిడి పూర్ణచంద్రరావు, భారతీలకు  వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు యువత గ్రామ అధ్యక్షుడు తలారి కాశీ నాయుడు నూతన వధూవరులకు గిఫ్ట్ గా ఇసుక డబ్బాను బహూకరించాడు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్న నేపథ్యంలో కాశీ నాయిడు.. ఈ గిఫ్ట్ తో అక్కడున్న వారందరికి షాకిచ్చాడు. మార్కెట్లో లో కొనుగోలు చేయడానికి ఇసుక తప్ప,బంగారం,వెండి,గృహ పరికరాలు అందుబాటులో ఉన్నాయని,  రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేయడానికి బహుమతిగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో వివాహ వేడుకకు హాజరైన వారు నవ్వుల్లో మునిగిపోయారు.

Sand box as Gift for New Bride and Groom