హైదరాబాద్: పాతబస్తీలోని నెహ్రూ పార్కు లో పేలవమైన భద్రత మరోసారి బహిర్గతం అయింది. స్మగ్లర్లు యధేచ్చగా గంధపు చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పార్కులోని 7 గంధపు చెక్కలను నరికి, చిన్న దుంగలుగా చేసి ఎత్తుకెళ్లారు.గంతలో కూడా స్మగ్లర్లు ఇదే తరహాలో రెండుసార్లు గంధపు చెట్లను దట్టమైన కంచెను నరికివేసి పార్కు నుంచి ఎత్తుకెళ్లారు.
ఈ నెల 20న జూపార్క్ లోని ఏడు గంధపు చెక్కలను స్మగ్లర్లు నరికి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి జూపార్క్ నుంచి తరలించినట్లు అధికారులు గుర్తించారు. జూపార్క్ ప్రహారీ గోడ చుట్టూ దాచిన కొన్ని గంధపు చెక్క దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బహదూర్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జూ పార్కుకు రెండు వైపులా ఎంట్రన్స్ఉండడం ..ఆ రెండు ఎంట్రన్స్లో ఏర్పాటు చేసిన సి.సి కెమెరాలను పరిశీలించినా ఆ గేట్ల గుండా గంధపు దుంగలను తీసుకెళ్లడం లాంటి దృశ్యాలు కనిపించకపోవడం జూ అధికారులను విస్మయానికి గురిచేసింది. దీనిపై అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.