సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి... అవసరమైతే కొత్త పార్టీ పెడుతానంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజీనామా చేయవద్దంటూ జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో కాస్త మెత్తబడిన జగ్గారెడ్డి 15 రోజుల పాటు తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేశారు. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని.. తన బాధను వారికే డైరెక్ట్గా వివరిస్తానని జగ్గారెడ్డి సీనియర్లతో చెప్పారు.
ఇదిలా ఉంటే రేపు సంగారెడ్డిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. పార్టీలో ఉండాలా.. వద్దా అనే విషయంలో పార్టీ కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయం తెలుసుకోనున్నారు జగ్గారెడ్డి. కాగా ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఆసక్తి ఆ పార్టీ నాయకుల్లో నెలకొంది.
ఇవి కూడా చదవండిః