ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు అదిరిపోయే శుభ‌వార్త చెప్పింది ప్ర‌భుత్వం. భీమ్లా నాయ‌క్ ఐదో షోకు అనుమ‌తి ఇచ్చింది. రెండు వారాల పాటు తెలంగాణ‌లో స్పెష‌ల్ షో వేసుకోమ‌ని కేసీఆర్ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హ్యాండ్సమ్ హంక్ రానా కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు.

మ‌రోవైపు ఇవాళ ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక  జరగనుంది. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో రేపు ఈ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు. ‘భీమ్లా నాయక్’ మూవీ పై ఇండస్ట్రీలో చాలా అంచనాలే ఉన్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండిః

పెండింగ్ చ‌లాన్ల వ‌సూలుకు పోలీసుల స్పెషల్ డ్రైవ్

కొనసాగుతున్న మేడారం హుండీ లెక్కింపు