పెద్ద గోపులారంలో విషాదం..దంపతుల ఆత్మహత్యతో అనాథలైన పిల్లలు

పెద్ద గోపులారంలో విషాదం..దంపతుల ఆత్మహత్యతో అనాథలైన పిల్లలు
  • సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద గోపులారంలో ఘటన

మునిపల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గోపులారంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఎస్సై రాజేశ్ నాయక్  తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద గోపులారం గ్రామానికి చెందిన బేగరి రమేశ్(40)కి కోహిర్  మండలం బిలాల్పూర్  గ్రామానికి చెందిన అనిత(30)తో 13 ఏండ్ల కింద వివాహం జరిగింది. అప్పటి నుంచి వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.

వీరికి అర్చన(12), అనురాధ(8), శ్రీనాథ్(5) పిల్లలు ఉన్నారు. భార్యపై రమేశ్​ అనుమానం పెంచుకోవడంతో 3 నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి.  ఈక్రమంలో మంగళవారం అర్ధరాత్రి భార్యాభర్తలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్,  కొండాపూర్  సీఐ వెంకటేశం, ఎస్సై రాజేష్ నాయక్  పరిశీలించారు. మృతుల బంధువు గుడిపల్లి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.