ఇద్దరికీ హెల్మెట్ ఉంటే శానిటైజర్ గిఫ్ట్

ఇద్దరికీ హెల్మెట్ ఉంటే శానిటైజర్ గిఫ్ట్

ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నవాళ్లకు మాత్రమే…

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ డ్యూటీతో పాటు సైబరాబాద్ పోలీసులు యాక్సిడెంట్లనివారణపైనా అవేర్నెస్ కల్పిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో గురువారం ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ట్రావెల్ చేసిన టూవీలర్స్ లో పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకుంటే శానిటైజర్ గిఫ్ట్ గా ఇచ్చారు. గతేడాది సైబరాబాద్ పరిధిలో జరిగిన రోడ్ యాక్సిడెంట్లలో సుమారు 450 మంది చనిపోగా.. అందులో 114 మంది పిలియన్ రైడర్స్ ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. హెల్మెట్ లేకపోవడం వల్లే 54 శాతం మంది చనిపోయినట్టు తెలిపారు.