నిజామాబాద్ లో లక్ష మంది పేదలకు హెల్త్​కార్డులు

నిజామాబాద్ లో లక్ష మంది పేదలకు హెల్త్​కార్డులు
  • మాజీ మేయర్​ సంజయ్​

నిజామాబాద్, వెలుగు : పేద కుటుంబాలు నగరంలోని ప్రైవేటు హాస్పిటల్స్​లో 30 శాతం రాయితీ ట్రీట్​మెంట్​ పొందేలా హెల్త్​కార్డులు ఇవ్వనున్నట్లు మాజీ మేయర్​ సంజయ్ ​ధర్మపురి తెలిపారు. మొదటి విడత లక్ష మందికి ఇవ్వాలని లక్ష్యం లక్ష్యం నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

నియోజకవర్గంతో సంబంధం లేకుండా అర్హులైన పేదలకు ఈ కార్డులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. నగరంలోని టాప్​హోప్, ప్రుడెన్స్, శ్రీకృష్ణ న్యూరో, ఇండస్, మెడికవర్​ హాస్పిటల్స్​లో తాము ఇచ్చే కార్డులతో రాయితీ వైద్యం పొందొచ్చన్నారు. చాలా రోజుల నుంచి తన మదిలో ఉన్న ఈ ఆలోచనను అమలు చేయడం గర్వంగా ఉందన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆధార్​కార్డులతో వచ్చి హెల్త్​కార్డులు పొందాలన్నారు. 

పసుపు బోర్డు ఎలక్షన్​ స్టంట్..​

లోక్​సభ సాక్షిగా పసుపు బోర్డు వీలుకాదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల కోసం పసుపు బోర్డు ప్రకటించిందని సంజయ్​ ఆరోపించారు. ఇది కచ్చితంగా ఎలక్షన్​ స్టంటేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో కాంగ్రెస్​ ఫైనాన్స్​చేస్తుందనే బీజేపీ ఆరోపణలపై మండిపడ్డారు.