పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇటీవల సౌత్ సినిమాల్లో విలన్స్గా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలు సత్తా చాటుతుండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా సంజయ్ దత్ సౌత్లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ 2, లియో సినిమాల్లో లో విలన్ రోల్ చేసిన సంజయ్ దత్, ప్రస్తుతం రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో విలన్ రోల్ చేస్తున్నారు.
ఆయన తాజాగా మరో తెలుగు సినిమాలో విలన్గా నటించబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్గా సంజయ్ దత్ నటించబోతున్నారట. ఇప్పటికే మేకర్స్ ఆయన్ను సంప్రదించగా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.