ఆర్టికల్ 370 కావాలా?.. అయితే పాక్‌‌కు వెళ్లి అమలు చేస్కోండి

ఆర్టికల్ 370 కావాలా?.. అయితే పాక్‌‌కు వెళ్లి అమలు చేస్కోండి

ఫరూక్ అబ్దుల్లాపై సంజయ్ రౌత్ ఫైర్
ముంబై: ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తున్న జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఫరూక్ అబ్దుల్లా 370, 35-ఏను అమలు చేయాలనుకుంటే పాకిస్తాన్‌‌కు వెళ్లి, అక్కడే వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలని రౌత్ చురకలంటించారు. ఇండియాలో ఆర్టికల్ 370, 35 ఏకు చోటు లేదని రౌత్ స్పష్టం చేశారు. దీనిపై ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.

‘మమ్మల్ని పాకిస్తాన్ వెళ్లిపోవాలని సూచనలు ఇస్తున్న వారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మేం పాక్‌‌కు వెళ్లాలనుకుంటే.. 1947లోనే వెళ్లేవాళ్లం. కానీ మేం భారత్‌‌తో ఉండాలనే నిశ్చయించుకున్నాం. ఇది మహాత్మా గాంధీ భారత్. బీజేపీ భారత్ కాదు. కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు నేను చనిపోను’ అని అబ్దుల్లా అన్నారు.