పేదలకు గుడ్ న్యూస్: ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్

పేదలకు గుడ్ న్యూస్: ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్

పేదలకు గుడ్ న్యూస్.. కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నవారికి ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనుంది శంకర నేత్రాలయం. ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి అడిటోరియంలో జరిగిన కార్యాక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. శంకర్ నేత్రాలయం గొప్ప కార్యక్రమం చేస్తుందని ప్రశంసించారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. గతంలో పేదలకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని తెలిపారు.

శంకర నేత్రాలయం వారు.. వారం రోజుల పాటు ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తున్నారని.. ఈ క్రమంలో సమయం సరిపోక.. ఆపరేషన్ ఇక్కడ జరగకపోతే తన సొంత ఖర్చులతోనైనా పంపిస్తానని మంత్రి చెప్పారు. సంపాదించింది అందరికీపంచాలన్నారు. అమెరికాలో చాలా మంది దానం చేస్తారని.. అదే మన దేశంలో దానం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారన్నారు. అందుకే.. సంపాదించినది పంచమని అందరికీ చెబుతానన్నారు. కొంచెం బిజీగా ఉండడం వల్లే సినిమా వాళ్లను కలవడం కుదరడం లేదని..త్వరలో సినిమా కార్మికుల కష్టాలను కూడా తెలుసుకుంటానని చెప్పారు. 3 ఎకరాల స్థలంలో కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.