పల్లెకు పోయిన పట్నం వాసులు.. హైదరాబాద్ రోడ్లు ఖాళీ..

పల్లెకు పోయిన పట్నం వాసులు.. హైదరాబాద్ రోడ్లు ఖాళీ..

ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్ని ఖాళీ అయ్యాయి. అసలు ట్రాఫిక్ అనే మాటే లేదు. హైదరాబాద్ సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసేందుకు పట్నం వాసులంతా పల్లెలకు క్యూ కట్టారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే వాళ్లంతా పెద్ద పండుగను అందరితో కలసి జరపుకునేందుకు పెద్ద ఎత్తున్న గ్రామాలకు వెళ్లారు.    

షాపు సెట్లర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల కారణంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో స్కూల్ జోన్లు కూడా బోసిపోయాయి. సంక్రాంతి మూడు రోజులు హైదరాబాద్ లో ఇదే పరిస్థితి ఉండనుంది. 

సెలవులకు సాఫ్ట్ వేర్లంతా ఊరి బాట పట్టడంతో ఐటీ క్యారిడార్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వందలాది ఫుడ్ కోర్టులు మూతబడ్డాయి. హైదరాబాద్ వాసులంతా గ్రామాలకు తరలివెళ్లడంతో.. సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీస్ అధికారులు పెట్రోలింగ్ పెంచారు. తాళలు వేసిన ఇళ్లే టార్గెట్ గా దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో.. నిరంతరం పోలీస్ సిబ్బంది గస్తీ లో పోలీస్ సిబ్బంది కాస్తున్నారు.