- సారథి’ పోర్టల్లో త్రీవీలర్స్కు నో ఆప్షన్
- బైక్, కారు, ఆ పై వాహనాలనే మెన్షన్ చేసిన కేంద్రం
- వందల మంది ఆటో డ్రైవర్ల తిప్పలు
- కేంద్రానికి లెటర్రాశామంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: కొత్తగా వచ్చిన ‘సారథి’తో ఆటో డ్రైవర్లకు లైసెన్స్కష్టాలు వచ్చాయి. ఆర్టీఏలో ఆటో డ్రైవర్లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే సారథి పోర్టల్లో ఆప్షన్లేదని, బైక్, కారు, ఆపై వెహికల్స్మాత్రమే ఉన్నాయని, లైసెన్స్కావాలంటే కారు నడపాలని తిరకాసు పెడుతున్నారు. నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ఆటో డ్రైవర్లు గందరగోళంలో పడ్డారు.
ఆటో అన్న పదమే లేదు..!
ఆర్టీఏ గత కొద్ది రోజుల కింద ‘సారథి’ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారానే లెర్నింగ్లైసెన్స్, పర్మినెంట్డ్రైవింగ్లైసెన్స్, డ్రైవింగ్లైసెన్స్ రెన్యువల్చేస్తున్నారు. లెర్నింగ్లైసెన్స్కావాలనుకున్న వారు ఆన్లైన్లో స్లాట్బుక్చేసుకుంటే సరిపోతుంది. అయితే, పర్మినెంట్లైసెన్స్కావాలనుకుంటే మాత్రం టెస్ట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం టూ వీలర్స్, ఫోర్వీలర్స్అన్నింటికీ సారథి పోర్టల్ద్వారానే లైసెన్స్లు ఇష్యూ చేస్తున్నారు. సారథి రావడానికి ముందు అన్ని డ్రైవింగ్ లైసెన్స్ ల మాదిరిగానే త్రీ వీలర్స్ (ఆటో) లైసెన్స్కూడా జారీ చేసే వారు.
కానీ ‘సారథి’ అందుబాటులోకి వచ్చాక పోర్టల్నుంచి త్రీ వీలర్ను తొలగించారు. పోర్టల్లో ఆటో అన్న పదమే లేదు. దీంతో ఆటో డ్రైవింగ్వచ్చిన వారు లైసెన్స్తీసుకోవాలనుకుంటే కుదరని పని అయిపోయింది. దీంతో చాలామంది అధికారులను సంప్రదిస్తే ‘ఇది కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సర్వీసు. ఇందులో ఆటోడ్రైవింగ్అన్నది లేదు.. తామేమి చేయగలమని.. కేంద్ర ప్రభుత్వానికి లెటర్రాస్తాం ’ అని చెప్తున్నారు. దీంతో ఆటో డ్రైవింగ్లైసెన్స్కోసం వెయిట్చేస్తున్నవారు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
కారు నడిపితేనే ఎల్ఎంవీ లైసెన్స్
ఆటో డ్రైవింగ్కు అప్లయ్చేసుకుంటే ఫోర్వీలర్స్నడపడం వచ్చి ఉండాలని అధికారులు చెబుతున్నారు. అంటే టెస్ట్ డ్రైవ్లో కారు నడిపి చూపిస్తే అధికారులు లైట్మోటార్వెహికల్ (ఎల్ఎంవి) లైసెన్స్జారీ చేస్తున్నారు. ఫోర్ వీలర్స్ డ్రైవింగ్ లైసెన్ తీసుకుని ఆటో ఎలా నడుపుతామని ఆటోడ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఆటో కొనుగోలు చేయాలన్నా ఆటోడ్రైవింగ్లైసెన్స్తప్పని సరి. గతంలో ఆర్టీఏ అధికారులు త్రీవీలర్స్డ్రైవింగ్లైసెన్స్జారీ చేసే వారు. అప్పట్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్తోనే ఇప్పటికీ కొందరు ఆటోలను నడుపుకుంటున్నారు. కొత్తగా ఆటో నడుపుకోవాలనుకునే వారిలో చాలా మందికి ప్రస్తుతం ఆటోడ్రైవింగ్లైసెన్స్లేదని ఆటోడ్రైవర్లు చెబుతున్నారు.
అంతే కాకుండా పాత ఆటో డ్రైవింగ్లైసెన్స్ఉన్న వారు కూడా గడువు పూర్తయిన తర్వాత రెన్యువల్చేయించుకోవాలన్నా ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు చేయడం లేదని వాపోతున్నారు. అధికారుల తీరుతో కొందరు ఆటో డ్రైవర్లు కారు డ్రైవింగ్ కోసం పరుగులు పెడుతున్నారు. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కనీసం 10వేల వరకు ఖర్చవుతోందని, కారు డ్రైవింగ్ నేర్చుకుంటే ఎల్ఎంవి ఇస్తున్నారు కానీ త్రీవీలర్స్ అని ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. సారథి పోర్టల్లో నెలకొన్న గందరగోళమే ఈ పరిస్థితికి కారణమని ఆటో యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.
