రోడ్డు రిపేర్ల కోసం సర్పంచ్​ భిక్షాటన

రోడ్డు రిపేర్ల కోసం సర్పంచ్​ భిక్షాటన

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు సర్పంచ్ శుక్రవారం యాదగిరిగుట్టలో భిక్షాటన చేశారు. యాదగిరిపల్లి నుంచి పెద్దకందుకూరు వరకు బీటీ రోడ్డు మొత్తం దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు రిపేరు కోసం ఎమ్మెల్యే, ఎంపీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన లేదని, గ్రామపంచాయతీ నిధులతో రిపేర్లు చేయిస్తానంటే ఆఫీసర్లు సహకరించడం లేదని సర్పంచ్ భీమగాని రాములు గౌడ్ ఆరోపించారు. రోడ్ల రిపేర్లకు అవసరమైన నిధుల కోసం యాదగిరిపల్లి నుంచి పెద్దకందుకూరు చౌరస్తా వరకు వెహికల్స్​ను ఆపి జోలె పట్టి భిక్షాటన చేశారు. ఆర్టీసీ బస్సుల్లోనూ విరాళాలు సేకరించారు. అనంతరం రాములు గౌడ్ మీడియాతో మాట్లాడారు. రోడ్డు రిపేర్ల కోసం మూడేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందించలేదని చెప్పారు. తప్పని పరిస్థితిలో జోలె పట్టి భిక్షాటన చేయాల్సి వచ్చిందన్నారు. దాతలు సహకరిస్తే వారం రోజుల్లో రోడ్డుకు రిపేర్లు చేయిస్తానన్నారు.