అప్పుల బాధతో సర్పంచ్  ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధతో సర్పంచ్  ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట వెలుగు: అప్పులు తెచ్చి ఊర్లో అభివృద్ధి పనుల చేస్తే.. సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యా యత్నం చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పిల్లల జగ్గూ తండాకు చెందిన ధరావత్ ఉపేంద్ర టీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్​గా గెలిచారు. ఊర్లో విలేజ్​పార్కు, సెగ్రిగేషన్​షెడ్, వైకుంఠధామం తదితర అభివృద్ధి పనుల చేసేందుకు రూ.20లక్షల వరకు అప్పులు చేశారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఉపేంద్ర బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు ఆమెను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. సమస్యను మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని, సర్పంచ్ గా కొనసాగే కంటే రాజీనామా చేయడం మేలని సర్పంచ్ భర్త ధరావత్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు.