సర్పంచ్ భర్త పెత్తనం.. తిరగబడ్డ గ్రామస్తులు

సర్పంచ్ భర్త పెత్తనం.. తిరగబడ్డ గ్రామస్తులు

మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలం బోయపల్లి గ్రామ సభలో సర్పంచ్ భర్త పెత్తనం చెలాయించాడు. నిధుల గోల్ మాల్ పై సర్పంచ్ సునీతను గ్రామ మహిళలు నిలదీయగా.. భర్త కలగజేసుకొని వాగ్వాదానికి దిగాడు. భర్త పెత్తనం ఏమిటని గ్రామస్థులు నిలదీశారు. టీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్ సునీత భర్తే.. పంచాయతీలో అధికారం చెలాయిస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ భర్త రాజ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.