పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సర్పంచుల డిమాండ్

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సర్పంచుల డిమాండ్

రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం చెల్లించే బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటికి నిన్న నల్లగొండ జిల్లా ఎరుగండ్ల పల్లిలో ఓ మహిళా సర్పంచ్.. చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు పుస్తెల తాడు తాకట్టు పెట్టింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ ఆఫీసులో సర్పంచులు నిరసన చేపట్టారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనమని కరాఖండిగా చెప్పేశారు. మండల పరిషత్ ఆఫీసులో పల్లె ప్రగతి కార్యక్రమంపై అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న  సర్పంచులు... నిరసన గళం విప్పారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుల విడుదలపై సాయంత్రంలోగా స్పష్టత ఇస్తామని ఎంపీడీవో రవీందర్ రెడ్డి అన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

సాయం కోసం సోనూ తలుపు తట్టిన జనం

వైజాగ్ లో రణ్బీర్.. ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్