
- సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్
హైదరాబాద్, వెలుగు: సర్పంచుల పెండింగ్బిల్లులు చెల్లించే వరకు ఎన్నికలు నిలిపివేయాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్చేశారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మాజీ సర్పంచులు ఎన్నికల సంఘం కమిషనర్రాణి కుముదినిని కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం యాదయ్య గౌడ్ మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు న్యాయం చేయాలని కోరారు. ఆయన వెంట ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, మెడబోయిన గణేశ్, పకీర బీరప్ప, బస్మాపురం స్వప్న తదితరులు పాల్గొన్నారు.