
- స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, స్విమ్మింగ్ వంటి ఆటలను ప్రోత్సహించడానికి కృషి చేస్తామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫిట్ ఫార్ములా స్విమ్మింగ్ చాంపియన్షిప్- ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని క్రీడా ప్రాంగణాలన్నీ క్రీడా కార్యక్రమాలతో కళకళలాడుతున్నాయని తెలిపారు.
ఫిట్ ఫార్ములా సంస్థ నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన అవ్య, తారక్ (అండర్--8), బన్సాల్, సిద్ధార్థ (అండర్--10), క్రిష, కేతన్ (అండర్12), కొంగర సింధూర, అర్జున్ కస్వానా (అండర్-14) రితిక, సోహన్ (అండర్-16)కు శివసేనారెడ్డి మెడల్స్ అందజేసి అభినందించారు.