సాత్విక్‌‌‌‌‌‌‌‌-చిరాగ్‌‌‌‌‌‌‌‌మరో‘సారీ’.. చైనా మాస్టర్స్‌‎లోనూ ఫైనల్లో ఓటమి

సాత్విక్‌‌‌‌‌‌‌‌-చిరాగ్‌‌‌‌‌‌‌‌మరో‘సారీ’.. చైనా మాస్టర్స్‌‎లోనూ ఫైనల్లో ఓటమి

షెన్‌‌‌‌‌‌‌‌జెన్‌‌: ఇండియా డబుల్స్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ప్లేయర్లు సాత్విక్‌‌‌‌‌‌‌సాయిరాజ్‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌షెట్టి జోడీ వరుసగా రెండో టోర్నీలోనూ ఫైనల్లో తడబడ్డారు.  చైనా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో రన్నరప్‌‎తో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌డబుల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ 19–21, 15–21తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌కిమ్‌‌‌‌‌‌‌‌వోన్‌‌‌‌‌‌‌‌హో–సియో సుయెంగ్‌‌‌‌‌‌‌‌జీ (కొరియా) చేతిలో ఓడారు. ఇటీవల హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ఓపెన్‌‌‌‎లోనూ రన్నరప్‌‎గానే నిలిచిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ జోడీ ఈ ఏడాది ఒక్క టైటిల్‌‌‌‌‌‌‌‌కూడా నెగ్గలేదు. 

45 నిమిషాల మ్యాచ్‌‎‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌ద్వయం వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంది. తొలి గేమ్‌‎లో 14–7 ఆధిక్యంలో నిలిచినా క్రమంగా వెనకబడింది. సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌తప్పిదాలు చేయడంతో కొరియన్లు వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి స్కోరును 15–15తో సమం చేశారు. ఈ దశలో ఇరు జంటలు పవర్‌‌‌‌‌‌‌‌స్మాష్‌‎లతో 17–17తో నిలిచాయి. 

కానీ కిమ్‌‌‌‌‌‌‌‌షార్ప్‌‌‌‌‌‌‌‌విన్నర్లు సంధించి ఆధిక్యాన్ని 19–17కు పెంచుకున్నాడు. చిరాగ్‌‌‌‌స్మాష్‌‎లు కొట్టడంతో స్కోరు19–19తో సమమైంది. కానీ లెఫ్టాండర్‌‌ కిమ్‌‌‌‌‌‌‌‌క్రాస్‌‌‌‌‌‌‌‌కోర్టు విన్నర్లతో గేమ్‌‎ను ముగించాడు. 3–2తో రెండో గేమ్‌‎‌‌ను మొదలుపెట్టిన ఇండియా ప్లేయర్లు బ్రేక్‌‌‌‌‌‌‌‌వరకు గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ల ఆట లయ తప్పింది. బలమైన రిటర్న్స్‌ లేకపోవడంతో కొరియన్లు  గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ సొంతం చేసుకునారు.