ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

వనపర్తి టౌన్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్  ద్వారా చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్  రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్​ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్  జిల్లా కన్వీనర్  రాజనగరం రాజేశ్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు 2004లో రద్దు చేసినప్పటి నుంచి విద్య, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. 

రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన మాదిగ ఉప కులాలకు 12 శాతం విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కాలని తెలిపారు. జూన్ 2 నుంచి 12 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎర్రమోని యాదగిరి, రాజనగరం రాజేశ్,  శివకుమార్, కొమ్ము కేశవులు, పరుశురాం, బాబు, సాయికుమార్  పాల్గొన్నారు.