భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కార్యకర్త, కబీర్మంచ్ సభ్యురాలు జ్యోగి జగ్ తాప్ కు సుప్రీంకోర్టులో ఉరట లభించింది.. బుధవారం (నవంబర్19) జ్యోతి జగ్ తాప్ కు మధ్యంతర బెయిల్ మంజూర్ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2026 కు వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకు ఆమెకు బెయిల్మంజూరు చేసింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదేళ్లు జ్యోతి జగ్ తాప్ కస్టడీలో ఉన్నారు..బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవది అపర్ణభట్ సుప్రీంకోర్టును కోరారు. వాదోపవాదాలు విన్నత ర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం జ్యోతి జగ్ తాప్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ కేసులో మరో నిందితుడు మహేష్ రౌత్ కు కూడా ఇంతకుముందు ఆరువారాల బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.
2018లో ఫూణెలోని భీమా కోరేగావ్ లో జరిగిన అల్లర్ల కేసులో జ్యోతి జగ్ తాప్ తో సహా 16మందిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. అల్లర్లకు వీరిని బాధ్యులుగా ఆరోపించింది. కోరేగావ్ సమీపంతో నిర్వహించిన ఎల్గార్ పరిషత్ 200 వార్షోకోత్సవ సభలేమరాఠా, దళిత గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలకు కారణమని వాదించింది. హింసకు కుట్రపూరితంగా పథకం పన్నారని ఆరోపిస్తూ 16మందిని అరెస్ట్ చేశారు. ఈమెయిల్స్ ఆధారంగా UAPA చట్టం కింది అభియోగాలు మోపారు.
