బాచుపల్లిలో మరో సీవోఈ క్యాంపస్‌‌‌‌..ఈ ఇయర్ నుంచే ప్రారంభించాలని ఎస్సీ గురుకులాల సొసైటీ నిర్ణయం

బాచుపల్లిలో మరో సీవోఈ క్యాంపస్‌‌‌‌..ఈ ఇయర్ నుంచే ప్రారంభించాలని ఎస్సీ గురుకులాల సొసైటీ నిర్ణయం
  • గౌలిదొడ్డి, ఉప్పల్, అలుగునూర్ సెంటర్లలో జేఈఈ శిక్షణ  
  • చిలుకూరు, మహేంద్ర హిల్స్, ఫలక్‌‌‌‌నుమా, బాచుపల్లిలో నీట్‌‌‌‌ కోచింగ్  
  • సరూర్‌‌‌‌‌‌‌‌నగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌‌‌‌లో సీఎంఏ, క్లాట్ కోర్సులు 
  • ప్రొఫెషనల్ కోర్సులకు కొత్త కేంద్రాలు, అదనపు సీట్లు

హైదరాబాద్, వెలుగు: మరో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఎస్సీ గురుకులాల సొసైటీ ఏర్పాటు చేస్తున్నది. దీన్ని హైదరాబాద్‌‌‌‌లోని బాచుపల్లిలో ఈ అకడమి క్ ఇయర్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. ఇటీవల ఓ అద్దె బిల్డింగ్‌‌‌‌ను కూడా ఫైనల్ చేసింది. ఇప్ప టికే గౌలిదొడ్డిలో, ఉప్పల్, చిలుకూరు, మహేంద్ర హిల్స్, ఫలక్​నుమా, సరూర్‌‌‌‌‌‌‌‌నగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌‌‌‌లో సీవోఈలు ఉండగా, ఇప్పుడు బాచుపల్లిలో మరొకటి అందుబాటులోకి రానుంది.

జాతీయ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని గౌలిదొడ్డి సీవోఈ  కేంద్రాన్ని పూర్తిగా జేఈఈ శిక్షణ కేంద్రంగా మార్చారు. ఇప్పటి వరకు ఇక్కడ శిక్షణ తీసుకుంటూ ఇటీవల జేఈఈ ఫలితాల్లో తక్కువ మార్కులు సాధించిన 192 మంది స్టూడెంట్స్‌‌‌‌ను అధికారులు మరో సీవోఈకి బదిలీ చేశారు. గౌలిదొడ్డి సీవోఈలో 95 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చిన 1,393 మంది స్టూడెంట్స్‌‌‌‌కు ఫ్యాకల్టీ ప్రత్యేక శిక్షణ ఇస్తూ వచ్చే ఏడాది మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించే దిశగా కృషి చేస్తున్నారు.  కాగా, బాచుపల్లి క్యాంపస్​లో నీట్​ కోచింగ్​ ఇవ్వనున్నారు.

ఒక్కో సీవోఈలో ఒక్కో కోచింగ్..  

ఎస్సీ గురుకులాల సొసైటీ అధికారులు నీట్, జేఈ ఈ శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేఈఈ శిక్షణకు గౌలిదొడ్డి, ఉప్పల్, అలుగునూర్ సీవోఈలను ఎంపిక చేయగా.. నీట్ శిక్షణకు  చిలు కూరు, మహేంద్ర హిల్స్, ఫలక్‌‌‌‌నుమా సీవోఈలను ఎంపిక చేశారు. ప్రొఫెషనల్ కోర్సులకు కొత్త కేంద్రా లు, అదనపు సీట్లను శాంక్షన్ చేశారు. సరూర్ నగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌‌‌‌ సీవోఈలలో కాస్ట్ అండ్ మేనేజ్‌‌‌‌మెంట్ అకౌంటింగ్ (సీఎంఏ), కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)కు శిక్షణ ఇస్తుండగా.. వంద సీట్లను సొసైటీ శాంక్షన్ చేసింది. 

మెరిట్‌‌‌‌ ఉన్నోళ్లకు అడ్మిషన్లు.. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో  సాధారణ  కాలేజీల  కంటే సీవోఈలకు అధిక డిమాండ్ ఉందని అధికారులు చెప్తున్నారు. మెరిట్ ప్రాతిపదికన 90 శాతానికి పైగా మార్కులు వచ్చినోళ్లకే సీవోఈలలో అడ్మిషన్లు ఇస్తున్నా మన్నారు. గత ప్రభుత్వ హయాంలో మెరిట్ లేకున్నా సీవోఈల్లో అడ్మిషన్లు ఇచ్చారని, దీంతో గత రెండేండ్లుగా సీవోఈల్లో రిజల్ట్‌‌‌‌ శాతం తగ్గిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీవోఈల్లోని మెరిట్ స్టూడెంట్స్‌‌‌‌ను ఎంపిక చేసి హైదరాబాద్ గౌలిదొడ్డి క్యాంపస్‌‌‌‌కు షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు.