ఢిల్లీ : కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలారు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ. స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ కంపెనీకి నాలుగు వారాల్లోగా రూ.453 కోట్లు చెల్లించకపోతే… అనిల్ అంబానీ 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది సుప్రీంకోర్టు. అనిల్ అంబానీ అహంకారపూరితంగా ప్రవర్తించారని కోర్టు సీరియస్ అయింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి కోటి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.
SC hold #AnilAmbani guilty of contempt of court; asks him to either pay Rs. 453 crore within 4 weeks or face 3 months jail term pic.twitter.com/gDhXWSGwin
— Doordarshan News (@DDNewsLive) February 20, 2019